బీజింగ్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ జులై 4వ తేదీన షాంఘై సహకార సంఘం (ఎస్సీవో) సదస్సులో పాల్గోనున్నారు. జిన్పింగ్ బీజింగ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ 23వ సదస్సులో సందేశమివ్వనున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ శుక్రవారం ప్రకటించారు. ఇతర దేశాధినేతలతో భవిష్యత్ కార్యచరణపై జిన్పింగ్ ఈ సందర్భంగా చర్చిస్తారన్నారు. సంయుక్త చర్యలతో ఎస్సీఓ గొప్ప విజయాలు సాధించగలదని విదేశాంగ శాఖ మరొక ప్రతినిధి మావో నింగ్ ఆకాంక్షించారు. వ్యవస్థాపక సభ్యదేశంగా ఎస్సీఓకు దౌత్యపరంగా అధిక ప్రాధాన్యతను చైనా ఇస్తుందని చెప్పారు. సభ్యదేశాలతో కలిసి అంతర్జాతీయ పరిణామాల పరిష్కారం, అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లేందుకు చైనా సిద్ధంగా ఉందన్నారు. యూరేసియాకు మెరుగైన భవిష్యత్ కల్పనను ఆకాంక్షిస్తోందని చెప్పారు. ఎస్సీఓతో సంబంధాలను పెంపొందించుకోవాలని చైనా కోరుకుంటోందని మావో వెల్లడిరచారు.