కాబూల్ : అఫ్గాన్లో నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం నేపధ్యంలో అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి రావలసిందిగా భారత ప్రభుత్వం కోరింది. దేశంలోని అతి పెద్ద నాలుగవ నగరం మజార్ ఇ షరీఫ్ నుండి ప్రత్యేక విమానంలో భారతీయులను వెళ్లిపోవలసిందిగా అక్కడి రాయబార కార్యాల యం సూచించింది. మంగళవారం సాయం త్రం ఈ ప్రత్యేక విమానం న్యూఢల్లీికి బయలు దేరడంపై మజార్లోని భారతీయ కాన్సులేట్ ఈ షరీఫ్ ట్వీట్ చేశారు. ప్రత్యేక విమానంలో బయలుదేరాలనుకునే భారతీయ పౌరులు తమ పూర్తిపేరు, పాస్పోర్టు నంబర్ వంటి వివరాలను కాన్సులేట్కు సమర్పించాలని కోరింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దాదాపు 1500 మంది భారతీయులు అఫ్గాన్లో ఉంటున్నారు. అఫ్గాన్ నియంత్రణలో ఉన్న జాతీయ శాంతి సయోధ్య ప్రక్రియకు భారత్ మద్దతు ప్రకటించింది.
తాలిబన్ల చేతుల్లో అఫ్గాన్ నగరాలు తాలిబన్లు గత నాలుగువారాల్లో ప్రధానన గరాలను స్వాధీనం చేసుకుంటోంది. నాలుగురోజుల్లో ఆరవ ప్రాంతీయ రాజధానిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.నిమ్రుజ్ ప్రావిన్స్ రాజధాని జరంజ్ ఉత్తర జవాన్ ప్రావిన్స్రాజధాని షెబెర్ఘన్, తాలెకాన్తో పాటు తాజాగా ఐబాక్,సార్ఎ పోల్ వంటి నగరాలు ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల నియంత్రణలో ఉన్నాయి. ఇప్పటివరకు తాలిబన్లు 500మంది సాయుధ దళాలలను చంపినట్లు సమాచారం. ఆగస్టు 31లోపు అఫ్గ్గాన్ నుంచి విదేశీ దళాలు వైదొలగాల్సిఉన్నందున తాలిబన్లు, అఫ్గాన్ దళాల మధ్య యుద్ధం తీవ్రమైంది. అఫ్గాన్ ప్రభుత్వానికి,తాలిబన్లను మధ్య చర్చలకు అమెరికా ముందుకు రావాలని యూసఫ్ ఇస్లామాబాద్లో విలేకరులతో పేర్కొన్నారు.