విశాలాంధ్ర -రాజంపేట: రాజంపేట మున్సిపాలిటీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాజంపేట మున్సిపాలిటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి సోమవారం రాయచోటి జిల్లా కేంద్రంలో 76వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో జిల్లా కలెక్టర్ పిఎస్ గిరిశా సమక్షంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ కమిషనర్ గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. కమిషనర్ ఉత్తమ ప్రశంస పత్రం అందుకోవడం పట్ల రాజంపేట మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, సచివాలయం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.