విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) ; మండల పరిధిలోని హనుమాపురం గ్రామ సమీపంలో ఉన్న నలంద డిగ్రీ కళాశాల సమీపంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతి చెందింది. ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ కొండలో నిప్పు పెట్టడంతో భయపడి చిరుత పులి ఇటువైపు వచ్చి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో చిరుత పులి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.