విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కర్నూలు జిల్లా కార్యదర్శి గుడిసె నర్సింహులు గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ధరఖాస్తు చేసుకోగా వైయస్ షర్మిల ఏడుగురితో వేరు వేరుగా మంతనాలు జరిపారు. ఇందులో భాగంగా గుడిసె నర్సింహులుతో కూడా షర్మిల చర్చించారు. ఎమ్మెల్యే టికెట్ ఎవరికిచ్చినా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని షర్మిల కోరారు.