విశాలాంధ్ర – ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల పరిధిలోనే తొగలగల్లు గ్రామంలో కొలిసే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీశ్రీ భూమినీల చెంచు లక్మి సమేత ఓబులేసు స్వామి ఉత్సవాలను పురస్కరించుకొని జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా బుధవారం ఉచిత త్రాగునీరును సరఫరాను చేపట్టారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ తొగలగల్లు గ్రామంలో మూడు రోజులు పాటు శ్రీశ్రీ భూమినీల చెంచు లక్మి సమేత ఓబులేసు స్వామి ఉత్సవాలను ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో అంగారంగా వైభవంగా జరుపుకుంటారని అన్నారు. ప్రస్తుతం గ్రామంలో త్రాగునీటి కొలత తీవ్రంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తొగలగల్లు గ్రామంలో తాగు నీరు కోసం ప్రజలు పండుగ సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వెంకప్ప ఆదేశాల మేరకు గ్రామంలో వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రజలకు ఉచిత త్రాగునీరు సరఫరా చేసామనన్నారు. జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జగన్నాథం సొంత ఖర్చులతో త్రాగునీరును వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తుండటంతో ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.