విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి విమర్శించారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ అధ్యక్షతన ఏఐవైఎఫ్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం యువజన, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని బయటకు తెస్తానన్న నరేంద్ర మోడీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో యువత తమ ఓటుతో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఏఐవైఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులుగా మహ్మద్ హుస్సేన్, కార్యదర్శిగా దస్తగిరి, కోశాధికారిగా గంగాధర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్షావలి, రాజు, సలీం, దాదాబాయ్, శివరాజు, వీరేష్, సుందర్ రాజు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.