విశాలాంధ్ర-కోసిగి. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం నారా లోకేష్ (41) జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి , మండల అధ్యక్షులు జ్ఞానేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి , కేక్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని రాబోయే టీడీపీ ప్రభుత్వంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడల పనిచేసి పార్టీ నీ బలోపేతం చేయాలన్నారు. యువగళం పాదయాత్రతో ప్రజల మన్ననలు పొందిన గొప్ప యువ నాయకుడన్నారు. నారా లోకేష్ నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజలు , యువకులు రాజకీయాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వక్రాణి. వెంకటేశ్వర్లు , నాడిగేని.అయ్యన్న , భరద్వాజ్ శెట్టి , నాడిగేని. మహాదేవ,పంపాపతి, రాజు , తదితరులు పాల్గొన్నారు.