ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు
పల్లెపాడులో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి గారు,మండల ఇంచార్జీ శ్రీ పి మురళీ మోహన్ రెడ్డి గారు.
విశాలాంధ్ర- కోసిగి : కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని పల్లెపాడు గ్రామంలో మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సియం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వాలంటర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శం నిలిచిందన్నారు. గ్రామ సచివాలయం నందు యంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో మండల ఇంచార్జీ శ్రీ పి మురళీ మోహన్ రెడ్డి తో కలిసి రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగిరెడ్డి పాల్గొన్నారు.సియం జగనన్న నవరత్నాల పథకాల అమలు తీరును ప్రతి గడపలో అడిగి తెలుసుకుంటూ,సచివాలయం ను సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ప్రతి 60ఇళ్ళకు ఓ వాలింటరును నియమిస్తూ, వారి ద్వారానే సంక్షేమ పథకాలను అందించే తీరును అందరి నుంచి మన్ననలు పొందడం మన ప్రభుత్వంకు గర్వకారణమని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో తాహాశీల్దార్ రుద్రగౌడ్,యస్ఐ సతీష్ కుమార్,డాక్టర్ మనోజ్ కుమార్,ఏఈ నరసింహులు,ఎపీఓ జయరాం, యంపీపీ ఈరన్న,బెట్టనగౌడ్, ఐరనగల్లు శ్రీనివాసరెడ్డి,జగదీష్ స్వామి,షౌఖత్ అలీ,బసిరెడ్డి,బుళ్ళి నరసింహులు,మల్లికార్జున గౌడ్,దొడ్డి నర్సన్న,దుద్ది నాగేష్,నరసింహులు గౌడ్,కాల్వ లక్ష్మయ్య,సోఫీ, చింతకుంట ఈరన్న,ఐరనగల్లు రామంజి,మాన్వి వెంకటేష్, ఉరుకుందప్ప,లంకారెడ్డి,నర్సయ్య, తిమ్మారెడ్డి,కృష్ణరెడ్డి,లక్ష్మన్న,నరసింహులు,సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు,గృహ సారథులు, వాలింటర్లు పాల్గొన్నారు