ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
మధ్యాహ్నం భోజనం అకస్మిక తనిఖీ
విశాలాంధ్ర- ఆస్పరి : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతం, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం వంటల నాణ్యతను రుచి చూచి, స్టోర్ రూమ్ లో ఉన్న బియ్యం, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై హెచ్ఎం విజయ కుమారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెనూ అమలుపై ప్రశ్నించారు. పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు సులభమైన పద్ధతిలో విద్యాబోధన చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలని సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాభ్యాసంలో ముందుండి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.