Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు లింగమయ్య

విశాలాంధ్ర – ధర్మవరం : రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు లింగమయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో వారు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా నాయకులు నాగప్ప శ్రీ సత్యసాయి జిల్లా నాయకులు బద్దలాపురం నరసింహులు, ధర్మవరం నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ముసుగు మధు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు, గ్రామ బహిష్కరణలు వెంటనే ఆపాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈనెల 21వ తేదీ రాయలసీమ అనంతపురం నడి ఒడ్డున జరిగే రజక రాష్ట్ర మహాసభకు పెద్ద ఎత్తున రజక సోదరీ సోదరీమణులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు వాల్పోస్టర్లను విడుదల చేశారు.ఈ మహాసభకు మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర రావు, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, అఖిలభారత మత్స్య కార్మిక సమైక్య నాయకులు సత్యనారాయణ మూర్తి, చేతి వృత్తిదారుల సమైక్య- ఏపీ.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి- రామాంజనేయులు తదితరులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ, జి .రామకృష్ణ, మురళి, రామాంజనేయులు, మల్లేనిపల్లి హరికృష్ణ, నాగరాజు, మళ్లీ, శ్రీనివాసులు, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img