విశాలాంధ్ర -కర్నూల్ సిటీ: మహిళల ఆత్మ రక్షణకు టైక్వాండో అవసరమని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. బుధవారం లక్ష్మికళ్యాణ మండపం హాల్లో జరిగిన టైక్వాండో శిక్షణ కార్యకమంలో ఆయన చిన్నారులకు కిట్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మారుతున్న కాలంలో బాల,బాలికలు చెడును ఆకర్షించే అవకాశాలు ఎక్కువన్నారు. ప్రధానంగా గంజాయి, స్మార్ట్ ఫోన్ల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారన్నారు.
అమ్మాయిల ఆత్మ రక్షణ కొరకు టైక్వాండ లాంటి శిక్షణ కార్యక్రమాలకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. చిన్నారులను చదువుకే అంకితం చేయకుండా కరాటే వ్యాయామంలో తల్లిదండ్రులు రోజు సాధన చేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు టి వెంకటేశ్వర్లు ఏ. రోహిత్ తల్లిదండ్రులు పాల్గొన్నారు.