విశాలాంధ్ర – కర్నూలు సిటీ : ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా జులై 5న విడుదల చేసిన సీఏ ఇంటర్ ,ఫైనల్ పరీక్ష ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఆ కళాశాల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు.సీఎ ఫైనల్ ఫలితాలలో జి.భార్గవి ఆల్ ఇండియా 11 వ ర్యాంకు,పి. కుమార్ 32వ ర్యాంక్,పి.రాజేష్ 34వ ర్యాంక్, సీఏ ఇంటర్ ఫలితాల్లో వి.హేమంత్ ఆల్ ఇండియా 19 వ ర్యాంకు,జి.పవన్ నాగసాయి ఆల్ ఇండియా 29వ ర్యాంక్,పి.చరణ్ ధనూష్ ఆల్ ఇండియా 37 వ ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు. సి.ఏ ఇంటర్, సి.ఏ ఫైనల్లో మాస్టర్ మైండ్స్ నుండి ఒక గ్రూపు కాని, రెండు గ్రూపులు కాని పాస్ అయిన వారు సుమారుగా 2000 మంది విద్యార్థుల వరకు ఉంటారని తెలియజేసారు.ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులకు , మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులైనా విద్యార్థులకు, తమవంతు సహాయ సహకారాలు అందించినటువంటి విద్యార్ధుల యొక్క తల్లిదండ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.