విశాలాంధ్ర- పెద్దకడబూరు : మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిపై గెలిస్తే 2 కోట్లు రూపాయలు పందెం కాసిన మాజీ ఎంపిపి రఘురామ్ సవాల్ కు టిడిపి సిద్ధమని టిడిపి రాష్ట్ర సాధకార సమితి సభ్యులు మల్లికార్జున ప్రకటించారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మంత్రాలయం ఎమ్మెల్యేగా తిక్కారెడ్డి గెలుపు ఖాయమని, రెండు కోట్లు పందెంకు సిద్ధం అన్నారు. ఈ మొత్తాన్ని ఇరువురు ఉరుకుందలో ఈరన్న స్వామి దేవస్థానంలో డిపాజిట్ చేద్దామని, మీరు సమయం చెపితే అప్పుడే డిపాజిట్ చేయడానికి సిద్ధం అన్నారు. నీవు ఎంపీపీగా పనిచేశావు, నీ భార్య రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ గా ఉందన్నారు. నీది అవినీతి సొమ్ము, మాది కష్టార్జితం అన్నారు. మీరు మన మండలానికి గానీ, మన గ్రామానికి గానీ, కనీసం మన కురువ కులస్తులకు గానీ ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలో కురువ కాలనీలో ఎంతమంది టిడిపి వెంట ఉన్నారో, ఎంతమంది వైసీపీ వెంట ఉన్నారో పంచాయతీ కట్ట దగ్గర నిరూపించడానికి నీవు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. తాగునీటి కొళాయి ఇంటింటికి ఇచ్చామని చెపుతున్నారని, గ్రామంలో పర్యటించి మీరు చెప్పింది నిజమైతే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని, మీరు చెప్పింది అబద్దమైతే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా అని వారు ప్రశ్నించారు. ఇతరులపై ఆరోపణలు చేసేటప్పుడు వెనుకా ముందు ఆలోచించాలని, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా ఆరోపిస్తే సహించేది లేదని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి మీసేవ ఆంజనేయులు, బీసీ సెల్ నాయకులు తలారి అంజి, మొట్రు ఈరన్న తదితరులు పాల్గొన్నారు.