విశాలాంధ్ర – కర్నూలు సిటీ: నగర మేయర్ బి.వై. రామయ్య మంగళవారం అమెరికాకు పయనమయ్యారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీల వరకు తెలుగు వారికి వెన్నుదన్నుగా నిలిచే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాట) నిర్వహించనున్న మహాసభలకు మేయర్ హాజరుకానున్నారు. తిరిగి ఆయన జూలై 21న కర్నూలు నగరానికి చేరుకోనున్నారు. కాగ మంగళవారం మేయర్ కు ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురు కార్పొరేటర్లు, అధికారులు, వైయస్ఆర్ సిపి నాయకులు వీడ్కోలు పలికారు.