విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలల మహిళా ఉపాధ్యాయులను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో నాగ జ్యోతి, మాలతి, సునీత, హేమ, హసీనా బేగం లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జీ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారని, విద్యాపరంగా మహిళలు ముందు వరుసలో ఉన్నారన్నారు. మహిళా ఉపాధ్యాయులు గృహిణిగా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉపాధ్యాయునులుగా విశేషమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గుంటెప్ప, ఉసేని, దామోదర్, నబీ సాహెబ్, రాజేంద్రప్రసాద్, కిరణ్ కుమార్, రవీంద్ర, శివన్న, విజయ్ కుమార్, శంకరప్ప, దొరబాబు, మనోహర్, బీరప్ప, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.