ఫోన్ ద్వారా విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్ ఇ
విశాలాంధ్ర -కర్నూల్ సిటీ : విద్యుత్ వినియోగదారుల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ ఆదేశాల మేరకు డయల్ యువర్ ఎస్ ఇ కార్యక్రమాన్ని చేపట్టామని కర్నూల్ విద్యుత్ భవన్ ఎస్ ఇ యమ్. ఉమాపతి తెలిపారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్ ఎస్ ఇ చాంబర్ లో ఆయన డయల్ యువర్ ఎస్ ఇ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 మంది విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను ఎస్ ఇ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రధానంగా పోల్స్, లైన్స్, రీడింగ్, లో వోల్టేజ్, విద్యుత్ అంతరాయం తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఫోన్ చేశారన్నారు. తన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని, మరికొన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి తనకు తెలియజేయాలని ఆదేశించామన్నారు.