విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండలంలో బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కొత్తగా ఎన్నికైన బిజెపి మండల అధ్యక్షురాలు మేరమ్మ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పెద్దకడబూరులో ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో బిజెపి మండల అధ్యక్షురాలుగా ఎన్నుకొన్న బిజెపి అధిష్టానానికి, ఆదోని ఇంచార్జీ పురుషోత్తం రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ పటిష్టతకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. అంతకు ముందు బిజెపి పార్టీ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా గుమ్మల మేరమ్మ, ఉపాధ్యక్షులుగా నజీర్ అహ్మద్, కార్యదర్శులు గా ఆంజనేయులు, మహ్మద్ రఫీ, రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శులుగా బీటి తిమ్మప్ప, గోపాల్, డొల్లయ్య మరో ఏడుగురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.