Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఆళ్లగడ్డ వాసికి డాక్టరేట్

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ అల్లావుద్దీన్ కు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ , అనంతపూరు నుంచి డాక్టరేట్ దక్కింది. ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.వి. లక్ష్మయ్య పర్యవేక్షణలో మోడలింగ్ సీజనల్, ఇంటర్ అన్యువల్ వేరియబులటీ ఆఫ్ అట్మాస్పియరిక్ కార్బన్డయాక్సైడ్ మరియు మీథేన్ ఓవర్ ఇండియన్ మాన్సూన్ రీజియన్( ఫిజిక్స్) అంశంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్ ప్రదానం చేశారు. పరిశోధనలో భాగంగా అంతర్జాతీయ, జాతీయ సమావేశంలో 11 సార్లు పాల్గొని 9 పరిశోధన పత్రాలు ప్రచురించారు. హైదరాబాదులో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో లో పరిశోధన చేసి ,శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ లో అనంతపురంలో పీహెచ్డీ పూర్తి చేశారు. 2017 లో గేటు, ఏపీ సెట్, టీఎస్ సెట్ కూడా ఉత్తీర్ణత సాధించాడు. పేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ అందుకోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు అల్లావుద్దీన్ ను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img