Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

మహిళల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

  • బడుగు బలహీన వర్గాలతో పాటు దేశంలోని మహిళలంతా కాంగ్రెస్ వైపే
  • నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుప్రవీణ

విశాలాంధ్ర – నంద్యాల : రాష్ట్రంతో పాటు దేశంలోని మహిళలంతా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వర్ణ సుప్రవీణ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సుప్రవీణ మాట్లాడుతూ గతంలో దేశంలోని మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో పెద్దపీట వేసిందన్నారు.అందుకే కాంగ్రెస్ పార్టీ మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు అల్కాలంబా, ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించామన్నారు. నంద్యాల జిల్లాలోని పాత, కొత్త కాంగ్రెస్ నాయకులను కలుపుకుంటూ 75 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మహిళలంతా ఏకమై పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్త్రీకి గుర్తింపును కలిగిస్తూ అనేక మంది మహిళలకు ఉన్నతమైన పదవులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రాష్ట్రంలో 53% శాతం కలిగిన మహిళా ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ వైపు మలుచుకుంటామన్నారు. వచ్చే ఎన్నికలలో నంద్యాలతో పాటు కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు మహిళమంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు శైలజ, నంద్యాల మండల అధ్యక్షురాలు కటారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img