భారత సైన్యానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆయుధాలను అందుబాటులోకి తీసుకువస్తుంది.70 వేల ఏకే 200 సిరీస్ అసాల్ట్ రైఫిల్స్ సైన్యానికి అందించడం కోసం భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. రక్షణ,భద్రతా వ్యవస్థ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 7.62ఐ39 మి.మీ ఏకే-203 రైఫిల్ లో 20,000ను నేరుగా దిగుమతి చేసుకుని, మిగిలిన వాటిలో 6.5 లక్షలను మన దేశంలో సంయుక్తంగా తయారు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించాయి.రైఫిల్ తయారీ సంస్థ అయిన ఇండో-రష్యా రైఫిల్స్ ప్రయివేట్ లిమిటెడ్కు చెందిన అధికారుల సమక్షంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యన్ ప్రతినిధుల మధ్య ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ రైఫిళ్లను ఈ ఏడాది నవంబర్ నుంచి సైనికులకు అందించనున్నారు.