దేశంలోని పలు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో వారంరోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐఎండీ వెదర్ బులెటిన్లో తెలిపినట్లే ఈరోజు రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గుజరాత్, మరఠ్వాడ, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి.