దిల్లీ హైకోర్టు
న్యూదిల్లీ: మనీలాండరింగ్ కేసులో దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు దిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. సీబీఐ, ఈడీ పెట్టిన రెండు కేసుల్లో బెయిల్ కోసం సిసోదియా కోర్టును ఆశ్రయించారు. సిసోదియా బెయిల్ పిటిషన్ను జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తిరస్కరించారు. సిసోదియా అధికారాన్ని దుర్వినియోగించారని, నమ్మకద్రోహం చేశారని, తనకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించుకున్నారని ఆధారాల ద్వారా తెలుస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా ఈ విధానాన్ని సిసోదియా రూపొందించినట్లు తెలిపారు. నిర్ణయాధికార సమగ్రతతో రాజీ పడినట్లు కోర్టు పేర్కొంది. సీబీఐ కేసులో బెయిల్ కోసం ట్రిపుల్ టెస్ట్లో సిసోదియా విఫలమైనట్లు తెలిపింది. తన రెండు ఫోన్లు పాడైపోయినట్లు చెప్పి వాటిని సమర్పించలేదని, ఆధారాలు లేకుండా చేయాలనుకున్న ఆరోపణలను తోసిపుచ్చలేమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ ఇవ్వలేమని, బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఆయన తన భార్యను వారానికి ఒకసారి కలుసుకోవచ్చునని దిల్లీ హైకోర్టు వెల్లడిరచింది. ఇదిలావుంటే సిసోదియా జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 31వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.