Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

విపక్షాల కూటమి పేరుకు ఇండియా అని ప్రతిపాదన


అధ్యక్షురాలిగా సోనియా, కన్వీనర్‌గా నితీశ్ కుమార్ ప్రతిపాదన
2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కారును ఓడించడమే ఉమ్మడి ధ్యేయంగా దేశంలోని విపక్షాలు ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే రెండు రోజుల పాటు బెంగళూరులో సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ భేటీకి దేశ వ్యాప్తంగా ఉన్న 26 పార్టీలకు చెందిన అధినేతలు, అగ్రనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా బీజేపీపై పోరాటం చేసి.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మరోవైపు.. ప్రతిపక్షాల భేటీ నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ.. మళ్లీ ఎన్డీఏను విస్తరిస్తోంది. కూటమి నుంచి వెళ్లిపోయిన వారిని మళ్లీ తిరిగి తీసుకురావడం.. కొత్త మిత్రులను ఎన్డీఏలో చేర్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.అయితే తొలి రోజు సమావేశంలో పార్టీల నేతలన్నీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అయితే గతంలో 2004 లో ఏర్పడిన యునైటెట్ ప్రోగ్రెసివ్ అలయన్స్ – యూపీఏ పేరు కాకుండా.. కూటమికి ఏ పేరు పెట్టాలి.. దాని ఎవరు అధ్యక్షత వహించాలి అనేదానిపై సోమవారం సమాలోచనలు జరిపారు. దానిపై అభిప్రాయాలు, సూచనలు చెప్పాలని అన్ని పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం రెండో రోజు పేర్ల ప్రస్తావన వచ్చింది. అయితే ఈ ప్రతిపక్షాల ఐక్యత కూటమికి ఇండియా అనే పేరును పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పేరుకు మెజారిటీ ప్రతిపక్షాల నేతలు ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.గతంలో 2004 నుంచి 2014 వరకు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్ – యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీనే ఈ ఇండియాకు కూడా అధ్యక్షురాలి పదవికి పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ కూటమికి బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా ఉంచాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు పోస్టులకు అదనంగా మరో రెండు సబ్‌ కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి అన్ని పార్టీలకు సంబంధించిన భేటీలు, కార్యక్రమాలను రూపకల్పన చేయడం.. మరో కమిటీ ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలను ఖరారు చేయడం వంటి పనులను చూడనున్నాయి.ఇక బెంగళూరులో నిర్వహించిన ఈ ప్రతిపక్ష సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 26 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. బిహార్‌ సీఎం నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img