Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న గురుకుల పాఠశాల

మండలం లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హవా

విద్యార్థుల, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులఫలితమే ఈ ఫలితాలు

ప్రభుత్వ పాఠశాలలకు ఎంఈవో అభినందనలు

( వత్సవాయి): సోమవారం నాడు వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండల ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను ప్రభుత్వ పాఠశాలలు కైవసం చేసుకున్నాయి మండల కేంద్రమైన వత్సవాయి లోని ఎం జె పి పాఠశాలలో 578 మార్కులతో షేక్ ఇస్మాయిల్, వత్సవాయి జడ్పీహెచ్ స్కూల్ జి రాజ్యలక్ష్మి 577 మార్కులతో ఎం కీర్తన భాయి 576 మార్కులతో మండల ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను ఏకంగా కైవశం చేసుకున్నాయి…. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఎల్ నాగరాజు మాట్లాడుతూ మండలంలో తొమ్మిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు పాఠశాలలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయని.. అదేవిధంగా మరొక మూడు పాఠశాలలు స్వల్ప తేడాతో నూరు శాతం ఫలితం సాధించాయని… బాల బాలికలు 525 మంది పరీక్ష రాయగా 509 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు….. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను మరియు విశిష్ట కృషిచేసిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img