Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చమురు నిక్షేపాలపై హక్కు కోసం పోరు

డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌

కృష్ణా – గోదావరి బేసిన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో వ్యాపించి ఉన్నది. ఇది భూఉపరితల పరంగా చూస్తే 28 వేల చదరపు కిలోమీటర్లలోను, సముద్రగర్భంలో 24 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలోను విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ)- 1956 ఆగస్టు 14 నుంచి చమురు, గ్యాస్‌ నిక్షేపాల కోసం పరిశోధనలు జరుపుతున్నది. 1978వ సంవత్సరంలో నర్సాపురం వద్ద మొదటి బావిని తవ్వి గ్యాస్‌ను కనుగొన్నారు. అక్కడేగాక ఆ బేసిన్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా చమురు, గ్యాస్‌ నిక్షేపాలు బయటపడ్డాయి. ఓఎన్‌జీసీకి ఉన్న ఆస్తులన్నిటిలోకీ అత్యంత ఎక్కువ ఉత్పాదకత వున్న విలువైన ఆస్తుల్లో కేజీ బేసిన్‌ ముఖ్యమైనది. ఇలాంటి సంపద్వంతమైన కేజీ బేసిన్‌ నిల్వలు మన ముంగిట్లో వున్నా ఆంధ్రరాష్ట్ర పజ్రలకు అందుబాటులో లేకపోవడమే విషాదం.
కాకినాడకు 30 కిలోమీటర్ల దూరాన సముద్రగర్భం నుంచి 2024 జనవరి7న ముడిచమురు ఉత్పత్తి ప్రారంభమవటమే తాజా పరిణామం. కృష్ణా – గోదావరి బేసిన్‌లో సహజవాయువుతో పాటు చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా. 21 వ శతాబ్దంలో సంపన్న శక్తివంతమైన దేశమంటే చమురు, సహజ వాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని అర్ధం. ఆంధ్రా తీరంలో వున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. దీనివలన ఆంధ్రప్రాంత ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించవచ్చు. కానీ బడా కార్పొరేట్‌ కంపెనీల అధిపత్యానికి కేంద్ర పాలకులు లొంగిపోవటం వలన ఆంధ్రాప్రజలు సంప దలకు దూరమయ్యారు. కేంద్ర ప్రభుత్వ వివక్ష వలన రాష్ట్రం మరింత నష్టపోతున్నది. అన్వేషణ, వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, ధర నిర్ణయ విధానాలను ప్రభుత్వం రూపొందించాలి. ఈ బాధ్యతను సరిగ్గా నిర్వహించిన చోట ప్రజలు సంపదలను అనుభవిస్తున్నారు. లేనిచోట రిలయెన్స్‌, అంబానీ లాంటి కొద్దిమంది కార్పొరేట్‌ శక్తులు లక్షల కోట్ల రూపాయల సంపదలకు అధిపతులై విలాసజీవితం గడుపుతున్నారు. మరోవైపు దేశంలో నిరుపేద ప్రజలు నికృష్టజీవితం గడుపుతున్నారు.
కేవలం విద్యుత్‌ ఉత్పాదనలోనేకాక ఎరువుల తయారీలో కూడా సహజవాయువు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంతోపాటు చౌకగా లభించే గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ను అందించటం ద్వారా సిమెంట్‌, సెరామిక్‌, రసాయనిక, అల్యూమినియం, స్టీల్‌ ప్లాంట్‌, ఫ్యా బ్రికేషన్‌ పరిశ్రమలలో ఖరీదైన విద్యుత్‌ మీద ఆధారపడటం తగ్గుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికిగ్యాస్‌ సరఫరా చేస్తే సంవత్సరానికి 1200 కోట్ల రూపాయలకు మించి ఖర్చు తగ్గుతుందని 2010లోనే అంచనా వేశారు. కేజీ బేసిన్‌ గ్యాస్‌ చాలినంతగా న్యాయమైన ధరకు లభిస్తే కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు కాలుష్యరహిత రసాయనిక పరిశమ్రల కారిడార్‌ను నెలకొల్పవచ్చు. కేజీ బేసిన్‌లో రోజుకి కొన్ని మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ నిక్షేపాలు ఉత్పత్తి చేయవచ్చు. కేవలం ఒక్క ఎంఎం ఎస్‌ సీిఎండీ యూనిట్‌ గ్యాస్‌, సుమారు 1000 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించగలదని నిపుణుల అంచనా. అంటే కేజీ బేసిన్‌ గ్యాస్‌లో సగాన్ని ఉపయోగించుకున్నా మనం లక్ష కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించవచ్చు. భారీగా ఉపాధిóఅవకాశాలను కలిగించవచ్చు . రవాణా రంగంలో బస్సులకు, లారీలకు, కార్లకు, ఆటోలకు సీఎన్‌జీ గ్యాస్‌ వాడకంవల్ల ఖర్చు తగ్గటమేకాకుండా కాలుష్యం నుంచి పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చు. గృహ అవసరాలకు గ్యాస్‌ పైపుల ద్వారా అతి చౌకగా వంటగ్యాస్‌ను అందించవచ్చు. దీని మూలంగా గ్యాస్‌ సిలిండర్లపై ప్రభుత్వ సబ్సిడీభారం తగ్గుతుంది. ప్రస్తుతం వెయ్యి రూపాయలకు పైగా ఖరీదవుతున్న వంట గ్యాస్‌ సిలిండర్‌కు సమానమైన గ్యాస్‌ను పైపులైన్‌ ద్వారా వందరూపాయలకే ఇవ్వవచ్చును. అలానే లీటర్‌ పెట్రోలును రు 10కే వాహనదారులకు అందించవచ్చు. 1990 వరకు సహజ వనరులన్నీ ప్రభుత్వ అధీనంలో వుండేవి. ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా కార్పొరేషన్‌ (ఐఓసీ), సహజ వాయువును, చమురును అన్వేషించి, వెలికితీసి ఉత్పత్తి చేసేవి. మరో ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) పైపుల ద్వారా రవాణా చేసి అమ్మకాలు సాగించేది. విదేశీ సంస్థల భాగస్వామ్యం కొంత వున్నా ఈ సంస్థలన్నీ ప్రభుత్వ నియంతణ్రలో ఉండేవి. ఆ తర్వాత క్రమంలో ప్రభుత్వంతో పనులు చేయించుకోవటంలో మెలుకువలు తెలిసిన రిలయెన్స్‌ లాంటి బడా కార్పొరేట్‌ సంస్థలు రంగప్రవేశం చేశాయి. నూతన ఆర్థిక విధానాలలో భాగంగా చమురు సహజవాయువు ప్రాంతాల వేలానికి దేశ విదేశీ కంపెనీలను ఆహ్వానించారు. దేశీయకంపెనీ అయిన రిలయెన్స్‌, విదేశీ సంస్థ అయిన కెయిర్న్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. ఇవి ప్రభుత్వరంగ సంస్థలను రద్దు చేయకుండానే వాటి పునాదిని ఱపయోగించు కుని విపరీతమైన లాభాలను గడిరచాయి.
కేజీ బేసిన్లో మన తొలిహక్కుపై అణచివేత
ప్రపంచీకరణ విధానాలలో భాగంగా చమురు గ్యాస్‌ నిక్షేపాలను దేశ విదేశీ కార్పొరేట్‌ వ్యాపార సంస్థలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో కేంద్రం 1997లో నూతన అన్వేషణ లైసెన్సింగ్‌ పాలసీని తీసుకువచ్చింది. నూతన విధానానికి రెండు లక్ష్యాలను ప్రభుత్వం ప్రకటించింది. సముద్ర గర్భంలోనూ, భూ ఉపరితలంలోనూ నూతన గ్యాస్‌ నిక్షేపాల కోసం అన్వేషణ ప్రోత్సహించి, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా స్వదేశీ గ్యాస్‌, చమురు ఉత్పత్తిని పెంచి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటం. రెండవది, ఈ పథకం కింద ప్రభుత్వం వేలంపాట ద్వారా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో నిక్షేపాల అన్వేషణకు ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం ప్రకారం తాము పెట్టిన పెట్టుబడిని లాభాలతో సహా త్వరగా రాబట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వంతో సంప్రదించి ధర నిర్ణయించే అవకాశాన్ని ప్రభుత్వం ఈ నూతన అన్వేషణదారులకు కల్పించింది. ఈ నూతన విధానం ప్రకారం కృష్ణా- గోదావరి బేసిన్‌లో సముద్రగర్భంలోని బావులలో అత్యధిక నిల్వలున్న గ్యాస్‌, చమురు నిక్షేపాలను రిలయెన్స్‌ కంపెనీ కైవసం చేసుకుంది. ఈ కంపెనీ తన సామ్రాజ్యాన్ని అనేక రంగాల్లోకి విస్తరించుకున్నది. సహజవాయువు, చమురునిక్షేపాలు మన ముంగిట్లో అంటే కేజీ బేసిన్‌లో పుష్కలంగా ఉన్నా ఆ వనరులను ఉపయోగించుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. దీనికి ప్రధాన కారణం కేజీ బేసిన్‌ గ్యాస్‌ సంపద రాష్ట్ర సరిహద్దులు దాటి తరలిపోవడం. సహజ న్యాయసూత్రాల ప్రకారం కేజీబేసిన్‌లో లభ్యమయ్యే సహజవాయువు మన రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతనే మన సరిహద్దులు దాటిపోవాలి. సహజ వనరుల యాజమాన్యం, నియంత్రణ ఆ ప్రాంత ప్రజలందరి ప్రయోజనాలను న్యాయమైనరీతిలో కాపాడేటట్లుగా రాజ్యవ్యవస్థ వ్యవహరించా లని భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు చెప్తున్నాయి. సహజ న్యాయానికి, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా బేసిన్‌లో లభ్యమవు తున్న సహజవాయువు మన సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్‌, మహారాష్ట్రలకు తరలిపోతున్నది. 45.50% గ్యాస్‌ను గుజరాత్‌కు తరలిస్తున్నారు. 24% మహారాష్టలోని పరిశ్రమలకు ఇచ్చేస్తున్నారు. మిగిలిన దాన్ని ఉత్తరపద్రేశ్‌కు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవసరాలకు 1.2 శాతాన్ని మాతమే కేటాయిస్తున్నారు. కేంద్రప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియా పరత్వం, పటిష్టమైన ప్రజా పోరాటాలు సాగని ఫలితంగా మన సహజ సంపద తరలిపోతున్నది. కేజీ బేసిన్‌లో సహజవాయువు ధరను నిర్ణయించటం ఒక ప్రహసనంగా మారింది. రిలయెన్స్‌ కంపెనీ ప్రవేశించేవరకూ గెయిల్‌ సంస్థ ల్యాంకో పరిశమ్రకు ఒక్కొక్క యూనిట్‌ 1.97 డాలర్ల చొప్పున సరఫరా చేస్తున్నది. నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ)కు కేజీ బేసిన్‌ నుంచి ఒక యూనిట్‌ గ్యాస్‌ను 2.97 డాలర్లకు సరఫరా చేస్తానని రిలయెన్స్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నది. తదనంతరం ప్లేట్‌ ఫిరాయించి 4.3 డాలర్లకైతేనే గ్యాస్‌ ఇస్తామన్నది. ఇంత ఎక్కువ ధరలు నిర్ణయించటానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఆ ధరకు గ్యాస్‌ కొనుగోలు చేస్తే ఎరువులు, విద్యుత్‌ ఉత్పత్తి, తదితర పరిశమ్రలకు భారం అధికమవుతుందన్న ఆనాటి కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి జైపాల్‌ రెడ్డిని ఆ శాఖ నుంచి తప్పించేశారు. ధర పెంచటం అన్యాయమన్న కేంద్రకార్యదర్శుల కమిటీ నిర్ణయాన్ని ఆమోదించ లేదు. ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఏదో ఘనకార్యం చేసినట్లుగా నటించి రిలయెన్స్‌ కోరిన 4.33 డాలర్ల ధరను 4.2 డాలర్లకు తగ్గించింది. అలస్యం గానైనా మేల్కొన్న ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేజీ బేసిన్‌ లోని సహజ సంపద లో మన రాష్ట్రానికి న్యాయసమ్మతమైన వాటా లభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే రిలయెన్స్‌ కంపెనీతో మాట్లాడుకోమంది. ఉన్న నిల్వలు మాకే సరిపోవు కాబట్టి కొత్తగా ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక్క యూనిట్‌ సహజవాయువును కూడా సరఫరా చేయలేను అని తేల్చి చెప్పింది. దీని ఫలితంగా మన రాష్ట్రం లో అప్పటికే ప్రైవేట్‌ రంగంలో నెలకొల్పన గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాలకు గ్యాస్‌ సరఫరా అసాధ్యమైంది. ఈ పరిస్థితులలో ఆనాటి ముఖ్య మంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి కేంద్రానికి కొన్ని సూచనలు చేస్తూ 29 లేఖలు రాశారు. న్యాయబద్ధమైన సూచనలలో ఏ ఒక్కదానిని కూడా కేంద్రపభ్రుత్వ మంత్రుల కమిటీ పరిగణనలోకి తీసుకొననేలేదు. 12వ ఆర్థిక సంఘం కూడా ఏ ప్రాంతంలో దొరికే సహజ వనరులపైన ఆ ప్రాంతానికి వినియోగ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. పార్లమెంటు స్టాండిరగ్‌ కమిటీ 2013 అక్టోబర్‌లో ఇచ్చిన నివేదికలో సహజ వనరులు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రానికి కనీసం 50 శాతం గ్యాస్‌తో పాటు రాయల్టీనీ కూడా ఇవ్వాలని సిఫార్సు చేసింది. సముద్ర అంతర్భాగం నుంచి గ్యాస్‌ తీసినా, భూమి నుంచి తీసినా రాష్ట్రానికి వాటా వుండాల్సిందేనని పార్లమెంటు కమిటీ తేల్చిచెప్పింది. మన గ్రామాల నుంచి, మన పొలాల నుంచి గ్యాస్‌ను పైపుల ద్వారా గుజరాత్‌కు తీసుకొని వెళ్తూ మనకు ఒక్క కేజీ గ్యాస్‌ కూడా ఇవ్వరట. మన రాష్ట్రంలో లభించే సహజ వనరులను దోచుకుని రిలయెన్స్‌ వంటి బడా కార్పొరేట్‌ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటాన్ని, మన ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనం వ్యతిరేకించాలి. లేనిపక్షంలో మనం భవిష్యత్‌ తరాల ముందు దోషులుగా నిలవాల్సివస్తుంది. నిజానికి ఇది ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల బాధ్యత. ఇప్పటివరకు మన ప్రజా ప్రతినిధులు స్పందించాల్సిన రీతిలో స్పందించని ఫలితంగా రాజకీయాలకు అతీతంగా రాజీలేని సమైక్య ఉద్యమాన్ని నిర్వహించవలసిన అవసరం నేడు ఏర్పడిరది. కేజీ బేసిన్‌లో లభించే సహజ వనరులపై మన ప్రాథమిక హక్కును సాధించుకోవటానికి పోరాట దీక్షతో కలసికట్టుగా ముందడుగులు వేద్దాం!
ఫోన్‌: 9000657799 కృష్ణా గోదావరి బేసిన్‌ చమురు గ్యాస్‌ సాధన సమితి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img