Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

నీరుకొండ ప్రసాద్‌

వలంటీర్లు ఎవరో కాదు, మన పార్టీని అభిమానించే మన వాళ్లేనని చెప్పడానికి గర్వపడుతున్నాను అని, వలంటీర్ల పేరుతో నియమితులైంది తమ అభిమానులు, కార్యకర్తలేనని విశాఖ జిల్లాలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డే స్వయంగా అంగీకరించారు. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు 90 శాతానికి పైగా వలంటీర్లు మా కార్యకర్తలే అని బహిరంగంగానే చెప్పగా, ఇప్పుడు తొలిసారిగా సీఎం జగన్‌ కూడా వలంటీర్లు మా కార్యకర్తలే అని ఒప్పుకున్నారు. ప్రజలకు సేవ చేయడంకంటే సొంత పార్టీకి వలంటీర్లతో సేవచేయించు కోవడమే అసలు ఉద్దేశం. దాదాపు 2.5లక్షల మంది వలంటీర్లను నియమించింది జగన్‌ ప్రభుత్వం. వలంటీర్లు పేరుకే ప్రభుత్వం నియమించిన స్వచ్ఛంద సేవకులు. నిజానికి ఆ ముసుగులో పనిచేస్తున్న అధికార పార్టీ వేగులు. ప్రజల సొమ్మును జీతాలుగా ఇస్తూ జగన్‌ తన రాజకీయ ప్రయోజనం కోసం ఏర్పాటు చేసుకొన్న వ్యవస్థ ప్రజాస్వామ్యానికి తీవ్ర సవాలుగా మారింది. ఎన్నికల కమిషన్‌ ఇప్పటికీ వారిని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల మాదిరిగానే పరిగణిస్తోంది. ఎన్నికల విధుల్లో వలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఇంతకుముందే ఈసీకి ఫిర్యాదు చేశాయి. వలంటీర్లకు ఎన్నికల విధులు అప్ప చెప్పవద్దని కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఈసీ చేతులు దులుపుకొన్నది. కలెక్టర్లు మొక్కుబడిగా కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు పంపించడమే తప్ప వలంటీర్లపై చర్యలు తీసుకున్నపరిస్థితి లేదు. వలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా వుండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఎన్నికల సంఘం వెన్నెముక లేకుండా వ్యవహరిస్తూ అధికార పక్షం ముందు సాగిలపడితే ప్రజాస్వామ్యానికి అర్ధం ఏముంటుంది? వలంటీర్లు నేటికీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ఎన్నికల ప్రచారం చేయిస్తుంది. ఓటర్ల జాబితాలో ప్రత్యర్థుల ఓట్లను తొలగించే ప్రక్రియకలో వలంటీర్లు పాల్గొంటున్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లను విధుల్లో కొనసాగిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే. ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు వంటి స్థానిక సంస్థల నేతలను విస్మరించి జగన్‌ వలంటీర్లనే నమ్ముకున్నారు. వలంటీర్లు ఉంటే చాలు మళ్లీ తాను అధికారంలోకి వస్తానన్న నమ్మకంతో ఉన్నారు.
వలంటరీ వ్యవస్థను తమ వశం చేసుకొని తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి రాళ్లెత్తే కూలీలుగా మార్చారు. వారు అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ప్రజలను ప్రభావితం చేస్తున్నారు. వైసీపీిపై అసంతృప్తితో ఉన్న వారి వివరాలు తెలుసుకోవడం, ఎన్నికల సంఘం కళ్లు గప్పి ఓటర్లను ప్రభావితం చెయ్యడం, ఓటర్ల జాబితాల్లో అయిన వాళ్లను చేర్చి, కాని వాళ్లను తొలగించడం ఇవే వలంటీర్ల స్వచ్ఛంద సేవలు. లబ్ధిదారులకు వేగంగా పింఛన్ల పంపిణి వలంటీర్లతోనే సాధ్యపడుతుందని అధికారపక్షం మహా గొప్పగా టముకు వేసుకొన్నది. కానీ ఆ ముసుగులో ఇంటింటికి పార్టీ ప్రచారం చెయ్యడం, గిట్టని వాళ్లకు బెదిరింపుల పర్వాలే కొనసాగుతున్నాయి. వలంటీర్లనే సమాంతర ప్రభుత్వ వ్యవస్థను సృష్టించి స్వీయ కార్యాలను చక్కబెట్టుకొంటున్నారు. ప్రజల కష్టార్జితాన్ని పన్నుల రూపంలో కడుతుంటే అందులో వారికి గౌరవ వేతనాలు, మొబైల్‌ చార్జీలు, అవార్డులు, సత్కారాల కోసం ఏడాదికి రూ.1850 కోట్లను పరోక్షంగా సొంత పార్టీ సేవలకు ఖర్చు పెడుతున్నారు. ఇవికాక వలంటీర్లకు నెలకు రెండువందలు చొప్పున ప్రజల సొమ్మునే పంచిపెడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామని చెబుతూ వారిని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు. వలంటీర్లు వైసీపీకి ప్రైవేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చడం కోసం అంటూ నియమించిన వలంటీర్ల వ్యవస్థ పూర్తిగా స్వప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్నదే. వలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీి విజయానికి వలంటీర్లు కృషిచేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ కోరారు. వలంటీర్ల పదవులు మన కార్యకర్తలకే ఇచ్చామని మరో మంత్రి వనిత అన్నారు. దీనిని బట్టి వారు చేస్తున్న సేవ ఎవరికో అర్ధం అవుతుంది. వైసీపీకి కళ్లు, చెవులు వలంటీర్లే. వాసికెక్కిన వలంటీర్లు జనం మీద నిరంతరం నిఘావేస్తున్నారు.
వలంటీర్లు సేవ చేస్తున్నది ప్రజలకు కాదు. వైసీపీికి. ఎన్నికలు ఏవైనా వలంటీర్లు అధికారపార్టీ నాయకుల తరపున ప్రచారం దగ్గర నుంచి, ఓటర్లకు డబ్బులు పంపిణీ వరకు వారే చక్కబెడుతున్నట్లు సమాచారం. గ్రామ స్థాయిలో వలంటీర్లకు వున్న అధికారం సర్పంచ్‌లకు కూడా లేదు. అంతే కాదు సంక్షేమ పథకాలన్నీ జగన్‌ ఇస్తున్నారని, మళ్లీ జగన్‌ సీఎం అయితేనే పథóకాలు అమలు అవుతాయని, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. జగన్‌ గెలవక పొతే ఇళ్లు, ఇళ్ల స్థలాలు రద్దు చేస్తారని లబ్ధిదారులను బెదిరిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ జెండాలు మోయిస్తూ వారిని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకొంటూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ఇంత అప్రజాస్వామిక విధానం ఏ రాష్ట్రంలోనూ లేదు. ప్రజా స్వామ్యబద్దంగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసేలా నానావిధ అక్రమాలకు తెగపడుతున్నారు. వలంటీర్లు ప్రజాధనాన్ని జీతాలు తీసుకొంటూ పాలక పక్షానికి ఊడిగం చేయడం సమర్ధనీయం కాదు. ఏ విధంగా అయినా తిరిగి అధికారంలోకి రావాలన్నది సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఏకైక లక్ష్యం. అందుకోసం అడ్డదారులు, అక్రమాలతో గెలవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వలంటీర్లు చేస్తున్న సేవ ఏమిటో? ఆ సేవ ఎవరికి చేస్తున్నారో? రాష్ట్రంలో వున్నది ప్రజాస్వామ్యమో? జగన్‌ స్వామ్యమో ప్రజలే అర్ధం చేసుకోవాలి. వలంటీర్లు ఇప్పటికైనా అనాగరిక, అరాచక, పనికిమాలిన పనులకు స్వస్తి పలికి ప్రజలకు సేవ చెయ్యడంపై దృష్టిపెట్టి, రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రజాస్వామ్యాన్ని ఓడిరచి అయినా సరే తాను గెలిచి తీరాలనుకునే జగన్‌మోహన్‌ రెడ్డి కుట్రలు నెగ్గితే ప్రజాకాంక్షలు కడతేరిపోతాయని ప్రజలు కూడా గుర్తించాలి. ఇది అత్యంత ప్రమాదకరమై చర్యగా భావించాలి. దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలో ఉండటం వలన ప్రతిపక్షాలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా అంతా అక్రమాలు, లోపాల పుట్ట. ఏ నియోజకవర్గంలో, ఏ పోలింగ్‌ కేంద్రంలో చూసినా చనిపోయినవారి ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటికి మించి ఓట్లు కలిగిన వారి పేర్లు జాబితాలో కొనసాగుతూనే వున్నాయి. మొదటి జాబితా నుంచి తుది జాబితావరకు అవే తప్పులు కొనసాగితే అధికారులు జరిగిన తప్పులను ఎక్కడ సరిదిద్దినట్లు? 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ను నిర్దేశించే అత్యంత కీలక ఎన్నికలు. ఇంతటి లోపభూయిష్టమైన ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరిగితే మళ్లీ అసమర్థులు, అరాచకులు, విధ్వంసకులు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఏమిటి?
ఫోన్‌ : 9849625610

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img