London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 21, 2024
Monday, October 21, 2024

మూఢనమ్మకాల్ని పాటించే వారిని బహిష్కరించండి!

డాక్టర్‌ దేవరాజు మహారాజు

దేవుడు ఉంటే పలస్తీనా ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న రక్తపాతాన్ని, నరమేధాన్ని ఆపలేదు ఎందుకూ? తమ కుమారులు కొట్టుకుని చావడం దేవుడికి ఇష్టమా ? యుద్దం జరగడంలో గానీ, శాంతి స్థాపనలో గానీ దేవుడి ప్రమేయం ఉండదని తెలుసుకోవాలి. దేవుడు లేడన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకోలేనంత కాలం, తమ సమస్యలు తామే పరిష్కరించుకోవాలని తెలుసుకోలేనంత కాలం, ‘మనుషుల్లో స్థాయీ భేదాలు లేవు, అందరిదీ ఒకే జాతి’ అని గ్రహించనంత కాలం – ప్రపంచంలో ఈ నరమేధం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మూఢనమ్మకాలను పాటించే వారిని, ప్రచారం చేసే వారిని ఆయా మతాల సంబంధీకులు నిర్దాక్షిణ్యంగా తమ తమ మతాల నుండి బహిష్కరించాలి. అప్పుడు గానీ మతాల మీద ప్రజలకు నమ్మకం కలగదు. అప్పుడే అవి నిజమైన మతాలు అవుతాయి. లేదా చిల్లర మతాలుగా మిగిలి పోతాయి. ఈ పని చేయాల్సింది మన భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపు కోవడానికే! మరి మతాలే అంధవిశ్వాసాల్ని వ్యాప్తి చేస్తుంటే ఏం చేయాలి ? తప్పదు – మతాల్నే త్యజించాలి! ఇంతకీ మతాలెందుకు ఏర్ప డ్డాయి? అవి ఎవరి కోసం పని చేస్తున్నాయో వాటి అంతరార్ధం ఏమిటో చూడండి. పురుషుడు పురుషుడి కోసం ఏర్పాటు చేసుకున్నదే మతం. వేర్వేరు మతాల్లో స్త్రీ పురుషులకు ఉన్న విలువ ఏ పాటిదో చూడండి. క్రైస్తవం ప్రకారం పురుషుడికి ఉన్న విలువలో స్త్రీ విలువ అరవై శాతమే – అని లివిటికస్‌ 27-3-7 చెపుతోంది. ఇస్లాం ప్రకారం (4-24) అంతకు ముందే వివాహమైన స్త్రీలను పురుషులు పెళ్ళి చేసుకోరాదు. బానిసలైతేనో లేక యుద్ధంలో గెలుచుకున్న వారైతేనో చేసు కోవచ్చు. హిందూ మతం ప్రకారం (తిన్ష-9 (33) పురుషులు 24-30 ఏళ్ళ వయసులో 8-12 ఏళ్ళున్న బాలికల్ని పెండ్లి చేసుకోవాలని మనుస్మృతి చెపుతోంది. జుడాయిజం (తల్‌మడ్‌) స్త్రీ – అనుభవిస్తూ ఆనందించవల్సిన ఒక తిత్తి (వస్తువు). జైనమతంలోని దిగంబర శాఖ ప్రకారం స్త్రీలు తమ తదుపరి జన్మలో పురుషుడిగా పుడితే గాని, నిర్వాణ స్థాయికి చేరుకోరు! మార్పులు చెందుతూ వచ్చిన ఒక బుద్ధ శాఖ ప్రకారం – పురుష భిక్షుల కన్నా, స్త్రీ సన్యాసులకు నిబంధనలు ఎక్కువ! బుద్ధుడి విగ్రహాలు మార్చి, హిందూ దేవతా విగ్రహాలుగా మార్చుకోవడం లోగడ చూశాం. ఇప్పుడు మరిన్ని కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆంబేద్కర్‌ రెండో భార్య సవిత బ్రాహ్మణ మహిళ కావడం వల్ల, అంబేద్కర్‌ బ్రాహ్మణులకు ఇంటి అల్లుడు అని, ఆయనను మేము తగురీతిలో గౌరవిం చుకుంటూనే ఉంటామని తిరుపతి బ్రాహ్మణ సంఘం నాయకులు రాఘవన్‌ అజయ్‌ కుమార్‌-ప్రమీలమ్మల ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో తొలిసారి అంబేద్కర్‌ 127వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. స్వార్థపరులైన కొందరు రాజకీయ నాయకులు అంబేద్కర్‌కు, బ్రాహ్మణ సంఘా లకు మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. అంబేద్కర్‌ పై చదువుల కోసం ఆనాడు ఓ బ్రాహ్మణుడు తన ఇంటిని అమ్మి ఆయనను విదేశాలకు పంపారనీ.. అవ్యక్తిని అంబేద్కర్‌ గురువుగా భావించే వారని అన్నారు. నిజమే కావచ్చు. కానీ, వైదిక/ హిందూ -మతవాదులు, మను వాదులు చేసిన దాష్టీకం గురించి అంబేద్కర్‌ ఎన్నో రచనలు చేశారు. ఎన్నో ప్రసంగాలు చేశారు. చివరకు ఆయన హిందూ మతాన్ని వదిలి, బౌద్ధం స్వీక రించారు. బుద్ధుణ్ణి హిందూ మతంలో కలుపుకున్నట్లు, దశావతారాల్లో ఒకడిగా చేసుకున్నట్లు – ముస్లిం అయిన సాయి బాబాను హిందూ దేవుడిగా ఆరాధిస్తున్నట్టు- రేపు అంబేద్కర్‌ను కూడా దేవుణ్ణి చేసే ప్రమాదం ఉంది. మనిషిని మనిషిగా ఉండనివ్వండిరా బాబూ – మీ స్వార్ధ ప్రయోజనాల కోసం, మీ పొట్ట కూటి కోసం.. ఎందుకు మనుషుల్ని దేవుళ్ళుగా చేస్తారూ? ఇక్కడ బ్రాహ్మణులను గురించి డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ ఏమన్నారో చూద్దాం – ‘‘ బ్రాహ్మణుడికి మతం వల్ల ఉపాధి లభిస్తుంది. కాబట్టి అతను మతం గురించే గొప్పగా మాట్లాడుతాడు. దళితులకు రాజ్యాంగంవల్ల ఉపాధి లభిస్తుంది కాబట్టి వాళ్ళు రాజ్యాంగం గొప్పతనం గురించే మాట్లాడాలి. మతం గొప్పతనం గురించి కాదు – రాజ్యాంగాన్ని నమ్ముకుంటే నిన్ను చెప్రాసి నుంచి రాష్ట్రపతిని చేస్తుంది. ఒక వేళ దళితులు మతాన్ని నమ్ముకుంటే అది మళ్ళీ వాళ్ళను అంటరాని వాళ్ళుగా, శూద్రులుగా, నిరక్షరాస్యులుగా, బానిసలుగా చేస్తుంది. మనువాదుల వల్ల వారి కొమ్ము కాస్తున్న బహుజనులవల్ల సమకాలీ నంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయి. మనిషి కేంద్రంగా, రాజ్యాంగం కేంద్రంగా నిర్ణయాలు ఆచరణలూ ఉండి ఉంటే, దేశంలో పరిస్థితి మరో రకంగా ఉండి ఉండేది. స్వాతంత్య్ర సమరంలో ముందు నిలిచిన గాంధీజీయే, మతం విషయంలో మనువాదులను అనుసరించాడు. జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ గాంధీజీ గురించి చెప్పిన మాటల్లో యదార్థమెంత ఉందో విశ్లేషించుకోవాలి. ‘‘రాజకీయా ల్లోకి మతాన్ని జొప్పించింది గాంధీజీయే. దాని వల్లే ఈ దేశ రాజకీయాలు భ్రష్టు పట్టాయి. గాంధీజీ ఎప్పుడూ గ్రామస్వరాజ్యం గురించి మాట్లాడేవారు కానీ, వాస్తవంలో ఏమయిందీ? గ్రామాలు అగ్రవర్ణాల, భూస్వాముల ఆధిపత్యంలోకి వెళ్ళిపోయాయి. పైగా, కుటీర పరిశ్రమలంటూ పారిశ్రామీకరణను అడ్డుకున్నారు. ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అయిన జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ ఆలోచనల్లో నిజం లేకపోలేదు. ఈ రోజు బహిరం గంగా, అధ్వాన్నంగా మతాన్ని ఆధారం చేసుకుని, ఒక పార్టీ అధికారంలో కొనసాగు తుందంటే – అందుకు కారణం గాంధీజీయే. చివరకు ఆయన ప్రాణం బలి తీసుకున్నది కూడా ఒక మత విద్వేషకుడేనన్నది గుర్తుంచుకోవాలి! ‘ఈశ్వర్‌ అల్లా తేరేనామ్‌’ – అంటూ మత సామరస్యానికి పాటు పడ్డారే గానీ, మతాన్ని నిరసించలేదు. వైజ్ఞానిక అవగాహన గూర్చి మాట్లాడలేదు. ఆ పని, తర్వాత కాలంలో పండిట్‌ నెహ్రూ చేసుకుంటూ వచ్చారు. మతం – ఆధ్యాత్మికత-సైన్సుల పరిధులేమిటో తెలుసుకో వడానికి ఇక్కడ ఒక దృశ్యం చూపెడతాను- ఒక మత గురువు చిన్న గోచి గుడ్డ తప్ప మరేమీ లేకుండా అంటే దాదాపు నగ్నంగా మార్చుని భక్తులకు మతం – ఆధ్యాత్మకత- దైవశక్తి గూర్చి బోధిస్తున్నారు. అయితే అతను కళ్ళజోడు పెట్టుకుని ఉన్నారు. మరి అది ఎందుకూ? తన ఆత్మ శక్తితో ఎదురుగా కూర్చుని ఉన్న భక్త జనాన్ని చూడొచ్చు కదా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిం దేమంటే- మతపిచ్చి అతని గుడ్డలిప్పదీసి నగ్నంగా కూర్చో బెట్టింది. మతం అతణ్ణి అనాగరికుణ్ణి చేసింది. ఇక కళ్ళజోడు అంటే సైన్సు- అతనికి చూపు నిచ్చింది. మత పిచ్చితో గుడ్డి వాడైన వాడు కూడా సైన్సుపై ఆధార పడక తప్పలేదు. ఎదురుగా ఉన్న మైకు, కళ్ళద్దాలు తీసేసి జనానికి ఏమైనా బోధించగలడా? ఆలోచించుకోవాలి ! మతం గొప్పదా? విజ్ఞాన శాస్త్రం గొప్పదా అనేది అర్థం చేసుకునేవాడికి, విషయం చెప్పకుండానే అర్థమవుతుంది! మతం ఆధారంగా అధికారంలో కొనసాగుతున్న నేటి కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న దురాగతాలు ఎన్నని చెప్పగలం? ఎటుచూస్తే అటు లెక్కలే నన్ని ఉన్నాయి. రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) కి చెందిన ఒక కాని స్టేబుల్‌ కదులుతున్న రైల్లో ముగ్గురు ముస్లింలను కాల్చి చంపాడు. మరోచోట ఒక ముస్లిం విద్యార్థిని వరుసగా క్లాసులోని తోటి విద్యార్థులంతా చెంపపై కొట్టా లంటూ.. ముజఫర్‌ నగర్‌ లో ఒక స్కూలు టీచర్‌ తన విద్యార్థులను ఆదేశిం చింది. దేశ వ్యాప్తంగా కాషాయ మూకలు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడం, ముస్లింలపై దాడులకు దిగడం జరుగుతున్న నేపథ్యంలో బిదూరీ విద్వేష ప్రసంగాలను కూడా చూడాల్సి ఉంది. ముస్లింలను సమూలంగా నిర్మూలించా లంటూ ‘ధర్మ సంసద్‌ ‘లు పిలుపునివ్వడం, గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని లేదా గొడ్డుమాం సాన్ని తీసుకెళుతున్నారనే నెపంతో ముస్లింలను వేధించి కొట్టి చంపడ మనేది హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వంటి బీజేపీి పాలిత రాష్ట్రాల్లో నిత్యం జరుగు తున్న విషయం – దేశ ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలు కాపాడడమంటే ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదాన్ని యూరోప్‌ దేశాల్లో ‘టెర్రరిజం’ అని అంటారు. ముస్లిం దేశాల్లో ‘జీహాద్‌’ అని అంటారు. దాన్నే సమకాలీన భారత దేశంలో ‘సనాతన ధర్మం’ అని అంటారని ఈ దేశ ప్రజలు నిర్వచించు కుంటున్నారు. అందుకే గాంధీజీ భావజాలాన్ని అంబేద్కర్‌ ఆనాడే వ్యతిరేకించారు. ‘‘గాంధీజీ దళిత హరిజనోద్దరణ కేవలం శిధిలమైపోతున్న హిందూమతానికి జీవం పోయ డానికి, దానినో కవచంగా స్వీకరించారేగానీ, సర్వ మానవ సమానత్వం కోసం కాదు. గాంధీజీ సిద్ధాంతాలు సామాన్య ప్రజలకు శాపాల్లాంటివి. అవి ఆర్థిక సమానత్యాన్ని నిర్దేశించని సిద్ధాంతాలు ! ముఖ్యంగా అవి, నిమ్న జాతులకు మరింత హానికరం ‘‘-అని అన్నారు అంబేద్కర్‌. గాంధీజీ స్వాతంత్రోద్యమంలో ముందు నిలబడ్డారే గానీ, మత విశ్వాసాల విషయంలో అంబేద్కర్‌ లా దేశానికి దిశానిర్ధేశం చేయలేక పోయారు. ప్రపంచంలో మతాల ప్రాబల్యం తగ్గుముఖంలో ఉంటే, మన దేశం లో మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘మతమే దేశభక్తి’ అని చెపుతోంది. క్రిస్టియానిటీని ప్రపంచంపై బలవంతంగా రుద్దిన ఇంగ్లాండ్‌లో -ఇప్పుడు అదే క్రిస్టియానిటీ తగ్గు ముఖం పడుతోంది. ఇంగ్లాండ్‌ లో క్రిస్టియన్ల సంఖ్య అరవైశాతం నుండి నలభై ఆరు శాతానికి పడిపోయింది. అలాగే ఏ మతాన్నీ పాటించని వారి సంఖ్య 26 నుండి 38 శాతానికి పెరిగింది. మరో దశాబ్దం నాటికి ఆ మతం మైనార్టీస్థాయికి వచ్చినా ఆశ్చర్య పోనక్కర లేదు. అయితే మత ప్రాతిపదికన సామాజిక శతృ త్వాలు పెరిగిపోయిన దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. భారత దేశం 9.4, నైజీరియా 8.5, ఆఫ్ఘనిస్తాన్‌ 8, ఇజ్రాయిల్‌ 8, మాలి 7.9, పాకిస్తాన్‌ 7.5, ఈజిప్ట్‌, లిబియా, సిరియా 7.4: ఇందులో తక్కువ స్కోరు ఉంటే అక్కడ సుహృధ్భావ వాతావరణం బావుందని అర్థం! అందువల్ల మత ప్రచారాలు చేసే వారిని, మూఢవిశ్వాసాలు ప్రచారం చేసేవారిని తక్ష ణం బహిష్కరించాలి. ఇది దేశ ప్రజలందరూ చేపట్టాల్సిన కార్యక్రమం !
` సుప్రసిద్ధ సాహితీ వేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌. మెల్బోర్న్‌ నుంచి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img