విశాలాంధ్ర-మక్కువ: మండలంలోని దుగ్గేరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ బయో ఇన్పుట్ ప్రొడక్షన్ సెంటరును జిల్లా ప్రకృతి వ్యవసాయ అసోసియేట్ సీహెచ్. శారద ప్రారంభించారు .శారద మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతులు ద్వారా పండించిన పంటలకు పురుగులు, తెగుళ్లు నివారణకు సహజ ఎరువులు, కషాయాలు, ద్రవణాలు తయారీచేసి, అతి తక్కువధరకు అమ్ముట కొరకు భారీగా సామూహికంగా ఈ కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. రైతులందరు
ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు.రైతులు ప్రకృతి వ్యవసాయ సాగును పెంచాలని కోరారు. ఈకార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ పి. యశోధమ్మ, వి. తిరుపతి నాయుడు, నలితం గంగరాజు, ఉర్లక నాగార్జున, గద్దె ధనబాబు ఐసిఆర్పీలు గులివిందల అశోక్, సీదరపు రాంబాబు, పాపారావు, కొండతామర అప్పలరాజు , రైతులు పాల్గొన్నారు.