విశాలాంధ్ర, పార్వతీపురం: టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుదవారం మన్యంజిల్లా టూర్ షెడ్యూల్ ఇలాఉంది. బుదవారం ఉదయం 10.30గంటలకు విజయనగరం అశోక్ బంగ్లాలో బయలుదేరి గజపతినగరం,బొబ్బిలి,సీతానగరం, పార్వతీపురం మీదుగా మధ్యాహ్నం 12.30గంటలకు తోటల్లి చేరుకుంటారు. 12.30నుండి 1.00గంటవరకు సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజి సందర్శన ఉంటుందని తెలిపారు.1.15కు ఎర్రన్న గుడివద్దకు చేరుకొని అక్కడ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశం నిర్వహిస్తారు. ఉల్లిభద్ర వద్ద 2.30నుండి 4.30వరకు కురుపాం నియోజకవర్గ రైతులు, నాయకులుతో పాటు గిరిజన నాయకులతో మీటింగు నిర్వహిస్తారు.సాయంత్రం 4.30నుండి 5.30 గంటలవరకు రోడ్ షో ద్వారా ఎర్రన్నగుడి నుండి పార్వతీపురం పాతబస్ స్టాండ్ వద్దకు చేరుకుంటారు. 5.30గంటల నుండి 6.30గంటలవరకు పాత బస్ స్టాండ్ వద్ద సమావేశం నిర్వహిస్తారు.అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాత్రిబస చేస్తారు. అక్కడ నాలుగు నియోజకవర్గాల నేతలతో, స్థానిక మేధావులతో సమావేశాన్ని నిర్వహించారు.
చంద్రబాబు ప్రోగ్రాం విజయవంతం కోసం తెలుగు తమ్ముళ్లు కలిసికట్టుగా ఉండి ప్రణాళిక ప్రకారం కార్యక్రమ నిర్వహణపై దృష్టి సారించారు. తోటపల్లి, ఉల్లిభద్ర కార్యక్రమాన్ని మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు.జనసేకరణకు, సభ నిర్వహణకు, ఆద్యంతం కార్యక్రమ నిర్వహణను పార్వతీపురం టీడీపీ ఇంచార్జి బోనెల విజయ్ చంద్రకు పార్టీ అప్పగించగా ఆయన స్తానిక నేతలతో సమన్వయం చేస్తూ కార్యక్రమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత,రాష్ట్రప్రతిపక్ష నేత, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన చంద్ర బాబు నాయుడు కార్యక్రమానికి జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటులో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.