Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఆగస్టు 15వేడుకలకు మైదానాన్ని పరిశీలించిన జిల్లాఅధికారులు

విశాలాంధ్ర – పార్వతీపురం: మన్యం జిల్లా ఏర్పడిన తరువాత రెండోసారి జరగనున్న 77వస్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబందించి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంను జాయింట్ కలెక్టర్ గోవిందరావు,పార్వతీపురం ఆర్డీఓ కె.హేమలతలు శుక్రవారం సందర్శించారు. ఏర్పాట్లుపై వారు చర్చించారు. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు, రెవెన్యూ తదితర శాఖల అధికారులతోపాటు డి.ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీరాములు,కుమార్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img