విశాలాంధ్ర,పార్వతీపురం: ప్రకృతి వ్యవసాయంచేస్తున్న రైతులు పండిస్తున్న పంటల ఉత్పత్తికి కోనుగోలు దారులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రాబర్డ్ పాల్, ప్రకృతి వ్యవసాయ జిల్లాప్రోజెక్టు మేనేజరు షణ్ముఖరాజులు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయప్రాంగణంలో వ్యవసాయశాఖ, రైతుసాధికారితసంస్థ ఆధ్వర్యంలో రైతులుపండిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు ప్రకృతి వ్యవసాయ సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వినియోగదారులు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.పల్లెలు సస్యశ్యామలంగా ఉన్నాయంటే వ్యవసాయమే కారణమన్నారు. నేడు రైతులు ప్రకృతివ్యవసాయం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు.ప్రకృతి వ్యవసాయం,ప్రకృతి సేద్యం గత కొంత కాలంగా అభివృద్ధి చెందుతోందన్నారు.ప్రకృతివ్యవసాయం అతితక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. గోఆధారిత సహజ ఎరువులు, మిశ్రమాలతో, ప్రకృతిలో సహజంగా దొరికే వనరులతో కషాయాలు, నూనెలు తయారు చేసుకుని, భూసారాన్ని పెంచుకుంటూ, చీడపీడల్ని నివారించుకుంటూ అధిక దిగుబడులతో పాటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ వినియోగదారులకు నాణ్యమైన రసాయన రహిత ఆహారాన్ని రైతులు అందిస్తున్నారని వివరించారు. ఈశిభిరంలో రైతులు ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా పండించిన బియ్యం, మిల్లెట్స్,బెల్లం,కూరగాయలు మొదలైనవి విక్రయిస్తారన్నారు. వీటిని కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలని కోరారు తెలిపారు.
ఈకార్యక్రమంలో ఏపీసిఎన్ఎఫ్ సిబ్బంది వై తిరుపతిరావు, బి తిరుపతి నాయుడు,గంగరాజు,ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న రైతులు పాల్గొన్నారు.