విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : చిన్నారుల వికాసమే అంగన్వాడీల లక్ష్యమని మద్దిపాడు సిడిపిఓ యువాంజలి అన్నారు మండల కేంద్రమైన నాగులుప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిషోర్ బాలికలకు రక్తహీనత పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారుఈ సందర్భంగా సిడిపిఓ ఇవాంజెలిన్ మాట్లాడుతూ కిషోర బాలికల్లో రక్తహీనత అవగాహన సదస్సు నిర్వహించామన్నారు వ్యక్తిగత వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతో ఉదాహరణ చేస్తాయన్నారు సిబ్బందికి పలు సూచనలు చేసిన ఆమె అంగన్వాడీ కేంద్రాలే చిన్నారుల వికాసానికి ఎంతో దోహదపడతాయని సూచించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కిరణ్ ప్రధానోపాధ్యాయులు సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు హెల్త్ సిబ్బంది మహిళా పోలీసులు పాల్గొన్నారు.