విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :-కాపు సంఘం జిల్లా నాయకులు ఆమంచి స్వాములు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ లో చేరుతున్న సందర్భంగా శనివారం జనసేనాని సైన్యం పెద్ద ఎత్తున మంగళగిరి తరలి వెళ్లారు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆమంచి స్వాములకు మద్దతుగా పెద్ద ఎత్తున 70 వాహనాల్లో బయలుదేరి మండల కేంద్రమైన నాగులుప్పలపాడు చేరుకొోగా జనసేన మండలాధ్యక్షుడు భూపతి మురళి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పెంట్యాల కోటేశ్వరరావు చదలవాడ ఎంపీటీసీ పమిడిముక్కల శివకృష్ణ కొంజేటి ధనుష్ బాలిశెట్టి నాగేశ్వరరావు తాడి దానమూర్తి తోట అంజి స్టాలిన్ బుర్రి దుర్గా పెంట్యాల కిరణ్ పాలపర్తి రవికుమార్ ఆకుల రామాంజనేయులు తదితరులు ఉన్నారు.