లీడ్స్: ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ డ్రాగా ముగియగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కోహ్లిసేన విజ యాన్ని అందుకుంది. 151 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈనెల 25న లీడ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం భారత జట్టు ఆదివారం లీడ్స్ చేరుకుంది. అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టింది. టీమిం డియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెషన్లో చమటోడ్చుతున్నారు.
చమటోడ్చుతున్న కోహ్లిసేన
లార్డ్స్ టెస్ట్ గత సోమవారం ముగిసింది. మూడో టెస్టుకు మధ్యలో వారానికి పైగా సమయం ఉండడంతో భారత ఆటగాళ్లు తమతమ కుటుంబాలతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టారు. మూడో టెస్ట్ కోసం ఆందరూ కలిసి ఆదివారం ఉద యమే లీడ్స్ చేరుకొని.. సాయంత్రం హెడిరగ్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ లోకేష్ రాహుల్, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కోహ్లి ప్రాక్టీస్ సెషన్లో చమటోడ్చాడు. పేసర్లు మొహ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్.. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్ సాధన చేశారు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్కు సంబంధించిన కసరత్తులు చేయగా.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచులు ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా సాధనకు సంబం ధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఉంచింది.
ఇషాంత్ స్థానంలో శార్దూల్
విదేశీ గడ్డలపై నలుగురు పేసర్లు, ఏకైక స్పిన్నర్ రూల్తో విరాట్ కోహ్లి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇదే ఫార్ము లాకు కోహ్లి కట్టుబడితే.. రవీంద్ర జడేజా స్థానంలో ఆర్ అశ్విన్కు అవకాశం దక్కవచ్చు. ఇషాంత్ శర్మ ప్లేస్లో శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. అయితే శార్దూల్ తొడ కండరాల గాయం నయమైతే ఈ మార్పు జరగనుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదు న్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా పరుగులు చేస్తే.. భారత బ్యాటింగ్కు ఎదురే ఉండదు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్లో ఉన్నారు.