విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాలే వీధిలో గల స్వకుల సాలే సమాజము, అంబా భవాని దేవస్థానంలో చత్రపతి శివాజీ మహారాజ్ వారి 397 వ జయంతి వేడుకలను ఘనంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ అధ్యక్షులు గంగాధర్, కార్యదర్శి మరాఠా జాదవ్ హరి, గౌరవాధ్యక్షులు సర్వోతే కృష్ణమూర్తి, కే హెచ్. రాజా, కె హెచ్ జగదీష్, సహాయ కార్యదర్శి నాగరాజు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వేడుకలు స్వ కుల సాలే సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, మా ఆహ్వానాన్ని మన్నించి, జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.జ్యోతి ప్రజ్వలను 15వ వార్డు కౌన్సిలర్ కుండా చౌడయ్య, స్వకల సాలె మహిళా సంఘ అధ్యక్షురాలు గాయక్వాడే చంద్రకళ భావించగా, తదుపరి చత్రపతి శివాజీ చిత్రపటం ఆవిష్కరణ ను మాజీ మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ కేహెచ్, ప్రకాష్, అనిల్ కదం, గంగాధర, వెంకటేశులు, కృష్ణమూర్తిలచే వారు నిర్వహించారని తెలిపారు. తదుపరి శివాజీ చిత్రపటంతో గ్రామోత్సవంతో పాటు మండల పరిధిలోని గొట్లురు లో ఉన్న విగ్రహానికి క్షీరాభిషేకము, పుష్పాలంకరణ గావించడం జరిగిందన్నారు. అనంతరం అనాధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర శివాజీ నిర్వాహకులకు కృతజ్ఞతలను తెలియజేశారు.