విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధి లో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవాలయం ఆవరణములో ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 95వ ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్ష కార్యదర్శులు బివి. రమణ, బండి నాగరాజు, సిరివెళ్ల రాధాకృష్ణ, మామిళ్ల అశ్వత్త నారాయణ కోశాధికారి దాసరి వెంకటేశులు (చిట్టి), తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజల కొరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వివేక్ కుల్లా యప్ప, డాక్టర్ వెంకటేశ్వరలు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ సుబ్రహ్మణ్యం పూజారి, డాక్టర్ డివి. జై దీపు నేతలచే వైద్య చికిత్సలతో పాటు ఒక నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరం కీర్తిశేషులు దాసరి కేశమ్మ, కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశులు, జ్ఞాపకార్థం వీరి కుమారులు రమాదేవి, డివి. వెంకటేశ్వర్లు అండ్ సన్స్ వారిచే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలతో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.