విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామంలో పంట కోసం అప్పులు చేసి ఆ అప్పును తీర్చలేక, శతమతమవుతూ, ఆర్థిక సమస్యలను ఎదిరించలేక ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ఏరుకుంట్ల గ్రామానికి చెందిన యువరైతు గుట్టూరు బాలకృష్ణ (35) తనకున్న 5 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నాడు, అదేవిధంగా అక్కడే వేరుశనగలు సాగు చేసి జీవనమును కొనసాగించేవాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు రాక ఉన్న రెండు బోర్లు కూడా నీరు ఇంకిపోవడంతో అప్పటినుంచి మనోవేదనకు గురయ్యాడు. తొలుత రెండు బోర్లు తదుపరి రెండు బోర్లు వేసినా కూడా అరకొరగా నీరు రావడంతో మామిడి తోట, వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయి నష్టపోయాడు. దాదాపు ఈ యువరైతు 5 లక్షల వరకు అప్పులు చేశాడు. అంతేకాకుండా డ్వాక్రా సంఘంలో 50,000 బ్యాంకులో బంగారమును తను కాబట్టి 40 వేలు అప్పు తెచ్చుకున్న కూడా, పంటలు పండక ఎన్నో బాధలను ఎదుర్కొంటూ వచ్చాడు. అనునిత్యం మనస్థాపనతో మధనపడుతూ అప్పులు బాధ తీర్చలేక ఇంటి సమీపంలో షెడ్డులో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఉదయం భార్య లేచి సరికి భర్త కనిపించకపోవడంతో పొలానికి వెళ్లి ఉంటాడని, అనుకున్న తరుణంలో ఇంటి పక్కన ఉన్న షెడ్డులో భర్త ఉరివేసుకున్న దృశ్యం భార్యను కుదిపివేసింది. నీతో కుటుంబీకులు బోరున వినిపించారు. పంటల కోసం అన్ని అప్పులు చేసి చనిపోతే మేము ఎలా బతకాలి అంటూ పిల్లల్ని ఎలా బ్రతికించుకోవాలి అంటూ భార్య శ్రావణి రోధించిన వైనం అందరినీ కలిసి వేసింది. తదుపరి రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సవ పరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేశారు. మృతునికి భార్య శ్రావణి తో పాటు కుమారుడు పోతులయ్య, కుమార్తె ప్రణతి ఉన్నారు.
రోడ్డు ప్రమాదములో తీవ్ర గాయాలుబీబీబీ మండల పరిధిలోని పోతుకుంట వైపు పోతుల నాగేపల్లి గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి పట్టణంలో పనిమీద తన టూ వీలర్ కు వచ్చి, తిరుగు ప్రయాణంలో మరో టూ వీలర్ ఢీకొనింది. వెంకటరామిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా చేనేతపల్లి మండలం వ్యాధిని గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి, బత్తలపల్లి మండలం అప్పరా చెరువు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ బాబు అను ఇద్దరు తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరం నుండి టూ వీలర్ లో బయలుదేరి వారి గ్రామానికి తరలివస్తుండగా, బత్తలపల్లి మండలం నల్ల బోయినపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విష్ణువర్ధన్ బాబుకు తీవ్రమైన గాయాలు కావడంతో బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రికి తరలించారు. మృతుడు అశోక్ రెడ్డి బీటెక్ నాలుగవ సంవత్సరం, విష్ణువర్ధన్ బాబు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నారు. బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.