విశాలాంధ్ర, కదిరి.కీచక ఉపాధ్యాయుడు కత్తి జనార్దన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపా ధ్యక్షుడు శేషం మహేంద్ర
డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ
కామాంధుడిగా మారిన కీచక
అధ్యాపకుడు కత్తి జనార్దన్ రెడ్డి కి వత్తాసు పలుకుతున్న మంగళకర కళాశాల యాజమాన్యం పై సమగ్ర విచారణ జరిపి పోక్సో యాక్ట్ నమోదు చేయాలని కోరారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు దారులు వేయాల్సినటువంటి అధ్యాపకుడే విద్యార్థినిలు పట్ల లైంగికంగా వేధించడం,వారిని భయభ్రాంతులకు గురి చేయడం ప్రశాంతికి నిలయమైన పుట్టపర్తి లో
కలకలం రేపడం బాధాకరమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జయచంద్ర రెడ్డి పై సమగ్ర విచారణ చేపట్టి తక్షణమే కేసు సుమోటోగా తీసుకొని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళకర కళాశాలలో జరుగుతున్న
అవినీతి అక్రమాలపై జిల్లా అధికారులు చొరవ తీసుకొని విచారణ చేపట్టాలని కోరారు లేని పక్షంలో కళాశాల ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దుగ్గిరెడ్డి , వేణు, తరుణ్, శశి , రోహిత్ తదితరులు పాల్గొన్నారు.