విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్ పి సి ఎస్ స్కూల్లో..1998-99 బ్యాచ్ విద్యార్థులు ఈనెల 4వ తేదీ ఆదివారం బిఎస్సార్ హైస్కూల్లో అపూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అపూర్వ విద్యార్థులు రమణ, ఎంబా ఆది, పోతలయ్య, బ్రహ్మచారి, సిరాజ్, ధనుంజయ, కొండన్న పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో కలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే, మరి కొంతమంది విద్య, ఉపాధి, వివాహం, ఇతర కారణాలతో ఎక్కడికెక్కడో వెళ్లి సిరపడటం జరిగిందన్నారు. అప్పట్లో అనగా పాతికేళ్ల క్రితం పాఠశాలలో గడిపిన ఆనందకరమైన మధుర క్షణాలను ఈ కార్యక్రమంలో చూడబోతున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునే అపూర్వ అవకాశం ఫిబ్రవరి 4వ తేదీ అని తెలిపారు. కావున ఈ బ్యాచ్ కి చెందిన విద్యార్థులు అందరూ కూడా కుటుంబ సమేతంగా తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఏదేని అవసరమున్న ఎడల సెల్ నెంబర్ 9100516474 కు గాని, 98 85502062 గాని సంప్రదించాలని తెలిపారు.