విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని పార్థసారధి నగర్( సిరికల్చర్ ఆఫీసర్ దగ్గర) కు చెందిన కీర్తిశేషులు డోలా రాజ్యలక్ష్మి (74) భర్త డిపి. నారాయణరెడ్డి మృతి చెందారు. కుటుంబ సభ్యులు విశ్వదీప సేవా సంఘం వారికి సమాచారాన్ని అందించగా, వారు కుటుంబ సభ్యుల ఇంటి వద్దకు చేరుకొని నేత్రదానంపై అవగాహన కల్పించారు. తదుపరి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వదేపా సేవా సంఘం ఆధ్వర్యంలో, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి టెక్నీషియన్ నాగరాజు ద్వారా నేత్రాలను సేకరించారు. తదుపరి నేత్రదానానికి సహకరించిన దాత భర్త నారాయణరెడ్డి, కుమారులు రాఘవేందర్ రెడ్డి, జయ ప్రకాష్ రెడ్డి, కోడలు రూప, శ్రీనివాసరెడ్డి లకు విశ్వదీప సేవా సంఘం వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాజుల సురేష్, కార్యదర్శి శేఖర్ రెడ్డి తోపాటు కేశవరెడ్డి, రఘు, సభ్యులు పాల్గొన్నారు.