ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు “మేరా పెహలే ఓటు దేశ్ కేలియే” అనే కార్యక్రమం పై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ బి.గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల నడుమ నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, గోపాల్ నాయక్ మాట్లాడుతూ ఓటు హక్కు వచ్చిన యువకులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికలను అవగాహన చేసుకుని మంచి నాయకులను ఎన్నుకుంటే భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని తెలిపారు. అదేవిధంగా యువత ప్రవలో ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛమైన నిర్ణయము ఒక్క ఓటు ఒక జీవితముతో సమానము అని వారు తెలియజేశారు. ధనిక పేదల మధ్య అంతరం లేకున్నా ఓటు హక్కును కల్పించారని వాటిని యువత సద్వినియోగం చేసుకొని రాజకీయ అవగాహనతో ఓటు వేయాలని తెలిపారు. అనంతరం ఓటు ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సెమీవుల్ల, చిట్టెమ్మ, కిరణ్ కుమార్, భువనేశ్వరి, పుష్పావతి, సరస్వతి, స్వామి, బోధ నేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.