విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో ఈనెల 16వ తేదీ శనివారం శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు, మేనేజర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి జన్మ దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆలయములో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సేవా రుసుమును చెల్లించి భక్తాదులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలుత స్వామి వారిని పంచామృతాభిషేకం, వివిధ అభిషేకాలతో పూజలు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ కూడా గావించబడునని వారు తెలిపారు. కావున భక్తాదులు ఈ జన్మ దిన ఉత్సవ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు