Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తుకు పునాది రాయి వంటిది

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తుకు పునాది రాయి వంటిదని, కాంగ్రెస్ గెలుపుతోనే శాశ్వత అభివృద్ధి సాధ్యమవుతుందని, అభివృద్ధి బాటలో ముందుకు వెళతామని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఉదయం, సాయంత్రం వేళల్లో… ఆర్టీసీ బస్టాండ్ రోడ్, సిద్దయ్యగుట్ట, దుర్గా నగర్, రేగాటిపల్లి రోడ్, సత్యసాయి నగర్, జోగోనికుంట, పోతుకుంట కాలనీ, గిర్రాజు కాలనీ జిల్లాలోని వ్యాపారస్తుల వద్దకు, అదేవిధంగా ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్లో కూడా కచ్చితంగా అభివృద్ధి బాటలో నడపాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు అందించి, అధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమము సాధ్యమవుతుందని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అమలు చేయనున్న పథకాలను, అభివృద్ధిని ప్రజలకు వివరించామని తెలిపారు. బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ మణిపూర్ లాంటి రాష్ట్రాలలో మారను హోమా సృష్టించిందని వారు ఆరోపించారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధిష్టానం మొదలుకొని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ముక్తకంఠముతో ఖండించారన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడాలన్న, ప్రజాస్వామ్యంతో పాటు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయకుండా చూడాలన్న కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని వారు తెలిపారు. కర్ణాటక, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కు రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు తప్పక అందజేస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను తప్పక అమలు చేసి తీరుతామని తెలిపారు. చేనేతకు జీఎస్టీని మినహాయింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సి ఏ ఏ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్, యు సి సి చట్టాలను రద్దు చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు, రైతు పెట్టుబడి మీద 50 శాతము లాభంతో మద్దతు ధర, ఉపాధి హామీ కూలీకి రోజుకు కనీసం 400 రూపాయలు వేతనము, వృద్ధులకు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు 6000రూ .పెన్షన్ ఇవ్వబడుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ఇండియా కుటుంభకే సాధ్యమవుతుందని తెలిపారు. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు గ్యారంటీతో తదితర పథకాలను వెనువెంటనే అమలు చేస్తామని చేనేత వ్యాపారులు కార్మికుల సంక్షేమానికి చేనేత బ్యాంకు ఏర్పాటు చేస్తామని, పట్టు ముడి సరుకు కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తామని, చేనేత ప్రాంతాలలో ప్రభుత్వ సహకారంతో ముడి సరుకు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా ఆంధ్ర సిల్క్స్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ఆత్మహత్యలు చేసుకున్న నేతలను తగిన ఆర్థిక సహాయంతో ఆదుకుంటామని తెలిపారు. ఓటుతోనే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేసేది కేవలం ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ నేనని, గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఎంతో కృషి చేసిందని నియోజకవర్గానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుతానని ఇండియా కూటమితోనే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేకూర్చుతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పేద ప్రజల గుండెచప్పుడు కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.ఈనెల 13న పోలింగ్లో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ ఇవ్వాలని వారు ఎంపీ అభ్యర్థిగా సమద్ షాహిన్ కు కూడా ఓటు వేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, జేవి రమణ, వెంకటస్వామి, రవికుమార్ వెంకటనారాయణ, శ్రీనివాసులు, పోలా లక్ష్మీనారాయణ,సిపిఎం నాయకులు ఎస్ హెచ్ భాష, జంగాలపల్లి పెద్దన్న, మారుతి, నాగార్జున, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహీర్, షమీవుల్లా, నారాయణస్వామి, అబ్దుల్ మునఫ్,జాఫర్, కరీం, సాయి, శంకర్, రాజు, మెహబూబ్ భాష, మన్సూర్ , కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img