Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బి.ఎస్ మక్బూల్ కు మద్దతుగా కౌన్సిలర్ల ప్రచారం

విశాలాంధ్ర-కదిరి : ..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ కు మద్దతుగా ఆరవ వార్డులో కౌన్సిలర్ మోపురి రాంప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ కౌన్సిలర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లతో వారు మాట్లాడుతూ సామ్యుడు, మంచి మనసున్న బి.ఎస్ మక్బూల్ కు కదిరి సీటును కేటాయించిన సీఎం జగనన్న ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అలాగే నిరుపేదలకు సంక్షేమం కావాలంటే కేవలం సీఎం జగనన్నతోనే సాధ్యమన్నారు.నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి బి ఎస్ మక్బూల్ కు అవకాశం కల్పించాలని వార్డులోని ప్రజలను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే పేదలకు మరిత మేలు చేకూరుతుందన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పరికి సాదిక్, వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి, పిచ్చిలి శంకర్, భాస్కర్ జిల్లా యస్సి సెల్, గంగాధర్ చెన్నూర్, రెడ్డి శేఖర్, మహబూబ్ భాష, దుర్గం బాబ్జాన్, కిరణ్ కుమార్, బాబా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img