Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

అలరారిన మానస నృత్య కళా కేంద్రం నాట్య ప్రదర్శన

విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల అనంతపురం జిల్లాలోని శిల్పారామం వేదికలో కార్యక్రమములో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం గురువు మానస ఆధ్వర్యంలో శిష్య బృందం ప్రదర్శించిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గురువు ఆర్. మానస మాట్లాడుతూ నా చిన్నతనము నుండే నా తల్లిదండ్రులు నాట్యం పట్ల ప్రోత్సహించి, నేడు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తేవడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలలో, వివిధ జిల్లాలలో మా మానస నృత్య కళాకేంద్రం శిష్య బృందం ప్రదర్శించిన నాట్యముకు ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు రావడం జరిగిందని తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విస్తరింప చేయడమే నా లక్ష్యము అని వారు తెలిపారు. శిల్పారామం వేదికలో మా శిష్య బృందం సాయి ప్రసాద్, నిక్షిత, గీత, సాహిత్య శేఖర్, రుత్విక, మాన్విక, ధ్రువకుశ, యశ్వంత్, నందకుమార్, గౌతం, వివేక్ ప్రదర్శించిన వివిధ నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షింప చేశాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా చదువుతోపాటు భారతీయ సంస్కృతి కళ లను ప్రోత్సహించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img