విశాలాంధ్ర కదిరి: రాష్ట్రంలో జరుగుతున్నా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పట్టణంలోని కుటాగుళ్ల మున్సిపల్ హై స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కునువినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు అనే ఆయుధం తో సరైన నాయుకుడిని ఎన్నోకోవాలని ఓటు హక్కుతో సరైన పాలనకు శ్రీకారం చుట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ,ప్రతీ ఒక్క ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవాని కోరారు.