Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

చల్లటి మజ్జిగ పంపిణీ..


విశాలాంధ్ర ధర్మవరం:: అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా పట్టణంలోని ఎల్సికేపురం వై జంక్షన్ వద్ద గాయత్రి పరివాహ సంఘం వారు చల్లటి మజ్జిగని ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పట్టణంలో ఎండ వేడిమి ఎక్కువ ఉన్నందున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామనీ తెలిపారు. అదేవిధంగా పట్టణములోని తారకరామాపురంలో గల సీతారామ కళ్యాణమండపంలో అక్షయ తృతీయ సందర్భంగా భక్తాదులకు, ప్రజలకు యుగ పరివర్తన మిషన్ అండ్ మిత్రుల సహకారంతో ఉచిత మజ్జిగ పంపిణీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ప్రజలకు ఉపశయ నం పొందడానికి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img