విశాలాంధ్ర, ఎన్ పి కుంట : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు సోమవారం నంబుల పూలకుంట వాస్తవ్యులు, రిటైర్డ్ విజయా బ్యాంక్ ఉద్యోగి సీఎం గంగిరెడ్డి జిరాక్స్ ప్రింటర్ మిషన్ వితరణ చేయడం జరిగిందని ఉన్నత పాఠశాల శిరీష పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌలభ్యం కొరకు స్థానిక నివాసి అయిన సీఎం గంగిరెడ్డి పాఠశాలకు తన వంతు సహాయం అందించడం అభినందనీయమన్నారు. పాఠశాలకు జిరాక్స్ మిషన్ వితరణ చేసిన గంగిరెడ్డి కి పాఠశాల సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామాంజులు, మురళి వెంకటరామిరెడ్డి, రిజ్వాన్, రమణ నాయక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.