విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్ మరియు జేఎన్టియు కళాశాల గోడౌన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ లో అంతర్భాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అందరి సమక్షంలో ఆయా ఈవీఎం గోదాము లోపల భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం కలశాలలో ఏర్పాటు చేసే గోడౌన్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, డిటి దివాకర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.